కరోనా సోకిన వృద్ధురాలు అత్యంత బాధకరమైన రీతిలో చనిపోయింది. ఆస్పత్రిలోని మరుగుదొడ్డిలో చనిపోయిన ఆ బాధితురాలిని ఎనిమిదిరోజులైనా ఎవరు చూడకపోవడం సంచలనం సృష్టించింది. అత్యంత హృతయవిదారకమైన ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాకు చెందిన ఓ 82 సంవత్సరాల వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో ఆమె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే సదరు మహిళ కన్పించడకుండా పోయిందని ఆస్పత్రి వర్గాలు ఇటీవల ప్రకటించాయి. నిజానికి ఆ మహిళ ఎనిమిది రోజుల క్రితం బాత్రూంకు వెళ్లి శ్వాస అందక అక్కడే చనిపోయింది. ఎనిమిది రోజులైనా ఆ మరుగుదొడ్డిని శుభ్రం చేసేందుకు ఎవరూ వెళ్లకపోవడంతో బాధితురాలి మృతదేహం అక్కడే పడి ఉంది. ఇది ఇలా ఉండగా.. మరుగుదొడ్డిలో ఎనిమిది రోజుల క్రితం చనిపోయిన వృద్ధురాలి కోడలు కూడా చనిపోయింది. కరోనా బారిన పడిన ఆమె ఇదే ఆస్పత్రిలోని ఐసీయూలో బెడ్ కోసం ఎదురు చూస్తూ మే 31న ప్రాణాలు విడిచింది.