ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపం పసివాడు.. బిస్కెట్ అనుకుని బాంబ్ ను..

national |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 03:55 PM

ఓ బాలుడు ఆడుకుంటూ చేసిన చిన్న పొరపాటే అతని ప్రాణాలు తీసింది. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం తిరుచిరాపల్లి జిల్లా అలగారైకి చెందిన ఆరేళ్ల బాలుడు విష్ణుదేవ్ ఆడుకుంటు ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి ‌చేపలు పట్టడానికి ఉపయోగించే జిలెటిన్‌ స్టిక్‌(పేలుడు పదార్థం) కనిపించింది. బిస్కెట్‌ అనుకొని అతడు ఆ బాల్ ను తిన్నాడు. ఒక్కసారిగా ఆ స్టిక్‌ పేలిపోవడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన బాలుడి తండ్రి, సోదరుడు మూడు జిలెటిన్ స్టిక్‌లను చేపలు పట్టడానికి తీసుకెళ్లి ఒక స్టిక్‌ను ఇంట్లో ఉంచి వెళ్లారు. ఇంట్లోనే ఉన్న విష్ణుదేవ్ జిలెటిన్‌ స్టిక్‌ను బిస్కెట్‌ అని పొరపాటున తినడానికి ప్రయత్నించగా పేలిపోవడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విష్ణు సోదరుడు గంగతరానా, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com