దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఉమ్మి ఎందుకు వేశామని ప్రశ్నించిన ఓ వ్యక్తిని దారుణంగా హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. మంగళవారం ఓ ఆలయ మార్గంలో ప్రవీణ్ అనే వ్యక్తి ఉమ్మి వేశాడు. ఈ విషయాన్ని గమనించిన అంకిత్ అనే మరో వ్యక్తి ఈ కరోనా సమయంలో ఇలా ఉమ్మి వేస్తావా అంటూ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి భగత్ సింగ్ కాంప్లెక్స్ వద్ద వీరిద్దరు మరోసారి ఘర్షణకు దిగి తీవ్రంగా కొట్టుకున్నారు. గాయపడిన వీరిద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అధిక రక్తస్రావం కావడంతో అంకిత్ చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్ను అరెస్ట్ చేశారు.