మధ్యప్రదేశ్ కు చెందిన టీవీ నటి, రాజవంశానికి చెందిన మోహన కుమారి కరోనా బారిన పడింది. వారం రోజులగా చికిత్స పొందుతున్న ఆమె తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులకు వీడియో సందేశం పంపింది. "రిషికేశ్ ఆస్పత్రిలో నేను చేరి 6వ రోజు. ఈ మహమ్మారి శారీరకంగా బాధపెట్టదు కానీ మానసికంగా ఇబ్బంది పెడుతుంది. మీ లోపల వైరస్ ఉందన్న విషయం మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఆ వ్యాధి నిజంగా బాధపెడుతుంది. కోవిడ్ బారిన పడిన నా కుటుంబ సభ్యులంతా బాగానే ఉన్నారు. మేము వైరస్తో పోరాడాం. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం. అయినప్పటికీ ఈసారి కూడా పాజిటివ్ వచ్చింది. మీ ప్రార్థనలు ఫలిస్తే త్వరలోనే అది నెగెటివ్ అని వస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పింది. మోహన కుమారితోపాటు ఆమె భర్త సుయేష్ రావత్, అతని తండ్రి, ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పల్ మహారాజ్ సహా ఏడుగురు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు.