ఏపీలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 68 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2787కు చేరింది. ఇప్పటి వరకు 1913 మంది డిశ్చార్జ్ కాగా 58 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 816 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. నేడు తూర్పు గోదావరి జిల్లాలో మరో కరోనా మరణం సంభవించింది. ఏపీ సర్కార్ కరోనా నియంత్రణకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి వేగంగా పెరగడం కలవరానికి గురి చేస్తుంది.