కరోనా వైరస్పై సుదీర్ఘ పోరాటం చేయాల్సివుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మహమ్మారిపై విజయం సాధించాల్సినందున అప్పటి వరకు దేశ ప్రజలు అలసిపోవడంగానీ, ఆదమరిచి విశ్రమించడంగానీ చెయ్యొదన్ని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘కరోనా వైరస్ మహమ్మారిపై ఇప్పుడు జరుగుతున్నది సుదీర్ఘ యుద్ధమని నేను పూర్తి బాధ్యతాయుతంగా చెబుతున్నాను. అయితే ఈ యుద్ధంలో మనం అలసిపోవడంగానీ, విశ్రమించడంగానీ చేయరాదు. ఇది గెలిచి తీరాల్సిన యుద్ధం. ఇవాళ దేశం ముందున్న ఒకే ఒక్క లక్ష్యం, సంకల్పం ఈ యుద్ధంలో గెలవడమే...’’ అని పేర్కొన్నారు.