కరోనా విజృంభిస్తుండడంతో ఆర్ధిక రంగం కుదేలైంది. దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు, వేతన జీవులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఓ వెసులుబాటు కల్పించింది. మూడు నెలల పాటు ఈఎంఐలపై మారటోరియం విధించింది. అయితే ఇందులో ఒక మెలిక ఉంది. మన దగ్గర డబ్బు ఉండి కూడా.. ఈఎంఐలు కట్టకపోతే అనవసరంగా మనం అధిక వడ్డీని కట్టాల్సి ఉంటుంది... "అన్ని టర్మ్ రుణాలకు సంబంధించి (వ్యవసాయ టర్మ్ లోన్లు, రిటైల్ మరియు పంట రుణాలతో సహా), అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మరియు లోకల్ ఏరియా బ్యాంకులతో సహా), సహకార బ్యాంకులు, అఖిల భారత ఆర్థిక సంస్థలు మరియు ఎన్బిఎఫ్సిలు ( హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) (“రుణ సంస్థలు”) అన్ని సంస్థాపనల చెల్లింపుపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేయడానికి అనుమతి మాత్రమే ఇచ్చింది. తాత్కాలిక నిషేధం తర్వాత మూడు నెలల నాటికి బోర్డు అంతటా మార్చబడుతుంది. తాత్కాలిక నిషేధ వ్యవధిలో రుణాలపై వడ్డీ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. రుణం వాయిదా వేశారు కానీ వడ్డీని వాయిదా వేయలేదు. ఇది కేవలం ఈఎంఐ హాలిడే మాత్రమే...వడ్డీ మాఫీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. మీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడమే ఉత్తమం. లేకపోతే అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.