ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 199 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 33,000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల 22 వేల మందికి పైగా ఈ వైరస్ సోకగా 1, 51, 766 మంది కోలుకున్నారు. సార్స్, ఎబోలా వైరస్ లతో పోలిస్తే ఈ వైరస్ తీవ్రత చాలా తక్కువ. భారత్ లో ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 96 మంది జయించారు.