ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ డి.వి.ప్రసాద్ ఢిల్లీలో మాట్లాడుతూ భారత్లోని పేదలకు మరో ఏడాదిన్నర పాటు ఆహారధాన్యాలకు ఇబ్బందిలేకుండా రిజర్వులు ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ చివరి నాటికి ప్రభుత్వ గోదాముల్లో దాదాపు 100 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు ఉంటాయి. మన దేశంలో పేదల వార్షిక అవసరాలకు 50 మిలియన్ టన్నుల నుంచి 60 మిలియన్ టన్నులు సరిపోతాయి. 2019-20 వార్షిక సంవత్సరానికి భారత్ రికార్డు స్థాయిలో 292 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుందని అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి గత ఏడాది కంటే ఈ సారి అధికంగా పంటలు పండనున్నాయి.