ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా 8వ పర్యాయం బిజు జనతా దళ్ (బిజెడి) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బిజెడి అధ్యక్ష పదవికి నవీన్ పట్నాయక్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. బిజెడి అధ్యక్షుడిగా నవీన్ పట్నాయక్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి పికె దేవ్ ప్రకటించారు. 1997 డిసెంబర్ 26న పార్టీ ఏర్పాటైననాటినుంచి నవీన్ పట్నాయక్ ఆ పార్టీ అధినేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.