దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా హింసను ప్రేరేపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి కాంగ్రెస్ హయాంలోనే డిమాండ్ ఉంది. రాజకీయ భవిష్యత్తుపై విపక్షాలకు ఆందోళన పట్టుకుంది అని కన్నా అన్నారు. అందుకే ఢిల్లీలో ఆందోళనలు, హింసను సృష్టిస్తున్నారు. రాజకీయంగా మోడీని ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. అరాచక శక్తులు దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర చేస్తున్నాయని అన్నారు