ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి పై మరో నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 12:26 PM

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం పై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి క్యాపిటల్ సిటి మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి జనవరి9నే ఉత్తర్వులు జారీ అయ్యాయని సమాచారం. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 25 గ్రామాలున్నాయి. వీటితో పాటు మరో 3 గ్రామాలు కలిపి 28 గ్రామాలతో అమరావతి సిటి మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది.


రాజధాని ప్రాంతం పై వివాదం చెలరేగుతుండడంతో అమరావతి ప్రజలకు బాసటగా నిలిచేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఎత్తుగడను ప్రభుత్వం వేస్తుందని అంతా చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో ప్రజలకు అండగా నిలవవచ్చని, దాని ద్వారా వారికున్న భయాన్ని తొలగించవచ్చన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా 3 రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న సీఎం జగన్ అమరావతి రైతులను శాంత పరిచేలా ప్లాన్ వేస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com