ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలి ఛైర్మన్ అనుసరించిన వైఖరి ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసేలా ఉందని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలని సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందన్నారు. ఈ విషయాన్ని విస్మరించి టీడీపీ బిల్లును అడ్డుకుందన్నారు. తప్పును సరిదిద్దుకుంటే శాసన మండలిని సీఎం జగన్ కొనసాగించే అవకాశముందని ఈ సందర్భంగా సునీత వ్యాఖ్యానించారు.