ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు భారత క్రికెటర్లు మాత్రమే ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయగలరు : లారా

national |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 01:52 PM

భారత్ నుంచి ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయగలరని బ్రియాన్ లారా జోస్యం చెప్పాడు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా టెస్టుల్లో 15 ఏళ్ల కిందట రికార్డు సృష్టించిన 400 పరుగుల రికార్డ్‌ కి ఏ ఒక్క క్రికెటర్‌ కూడా చేరుకోలేక పోతున్నారన్నారు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 335 పరుగులతో లారా రికార్డ్‌ని బ్రేక్ చేస్తాడని ఊహించాను. కానీ.. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్‌పైన్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేయడంతో వార్నర్ 335 పరుగులతో నాటౌట్‌గా నిలిచిపోయాడు. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 582 బంతులను ఆడిన లారా 43 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 400 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు. కాగా.. చాలా మంది క్రికెటర్లు ఈ రికార్డ్‌ని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. ఎవరూ రికార్డు చెరువులోకి కూడా వెళ్లలేకపోయారు. 400 పరుగుల రికార్డ్‌ని భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, పృథ్వీ షా బ్రేక్ చేసే అవకాశం ఉందని అయన పేర్కొన్నారు. టెస్టుల్లో రోహిత్ శర్మ మంచి పిచ్, పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా ఆ రికార్డ్‌ని అందుకోగలడు. కానీ.. ఆరంభం నుంచి అతను బ్యాటింగ్‌లో అటాకింగ్ ఆప్షన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నాడు. ఇక మరో క్రికెటర్ పృథ్వీ షా.. అతను మంచి అటాకింగ్ బ్యాట్స్‌మెన్. వయసు కూడా 19 ఏళ్లే కాబట్టి.. పృథ్వీ షా కొన్నేళ్లపాటు క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉంది. అతను తప్పకుండా త్వరలోనే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడని లారా వెల్లడించాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com