ప్రకాశం జిల్లాలోని స్థానిక పూలసుబ్బయ్య కాలనీలోని మున్సిపల్ హైస్కూల్లో శనివారం ఏపి మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినులకు రక్షణ, ప్రమాదాల గుర్తింపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా సొసైటీ జెఆర్పి టి.లక్ష్మి మాట్లాడుతూ స్త్రీలకు, బాలికలకు హింస వ్యతిరేఖ పక్షోత్సవాలపై అవగాహన కల్పించడం జరిగిందని, ఈ పక్షోత్సవాలు నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు 15 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. హింసను వ్యతిరేఖించే క్రమంలో బాలికలు సామర్థ్యాలు పెంచుకోవాలని, టోల్ ఫ్రీ నెం. 1098, 181, 100 నెంబర్ల గురించి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7,8,9 తరగతుల బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.