అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న భారత్ కి చెందిన అనిలేష్ అహుజా అనే వ్యక్తి ప్రీమియం పాయింట్ పేరుతో అమెరికాలో ఓ కంపెనీ స్థాపించి ప్రజలని మోసం చేసాడంటూ అక్కడి పోలీసులు అరెస్టు చేసి లోపలేసారు.
ఇంతకీ వీరు చేసిన నేరం ఏమిటంటే. తమ కంపెనీ భారీ లాభాల బాటలో పయనిస్తోందని, స్టాక్ మార్కెట్ నష్టాల బారిన పడుతున్నా తమ కంపెనీ అనేక లాభాలందుకుంటోందంటూ ప్రచారం చేశారు. ఈంతో అనేక మంది ఈ కంపెనీ నుంచి పీపీఐ షేర్లు కొనుగోలు చేసారు. షేర్లు కొన్నవారికి మాయమాటలు చెప్తూ మోసం చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు కాజేయటంతో పాటు షేర్లు అమ్మి పెడతామంటూ తీసుకుని డబ్బులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో భాదితులు సదరు కంపెనీపై ఫిర్యాదు చేసారు.
దీనిపై స్పందించిన అమెరికన్ పోలీసులు అనిలేష్ అహుజాతో పాటు ఆతని బిజినెస్ పార్ట్నర్ని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరు. ఈ కేసు విచారణ చేసిన కోర్టు ప్రధాన నిందితుడు అయిన అహుజా కి 50 నెలల జైలు శిక్ష , ఆతనికి సహాయపడిన వ్యక్తికి 40 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వటంతో ఇరువురూ జైలు ఊచలు లెక్కించుకుంటున్నారిప్పుడు.