ఏపీఎండీసీ ద్వారానే ఇసుక అమ్మకాలు జరుగుతాయని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ ఇసుక ర్యాంపులకు వేలంపాట నిర్వహించే ఆలోచన లేదన్నారు. గత ప్రభుత్వం రూ.60వేల కోట్ల పెండింగ్ బిల్లుల్లో రూ.20వేల కోట్లు చెల్లించామన్నారు. ఏపీలో ఎంత మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో స్పష్టత లేదన్నారు. శాఖలు, జిల్లాల వారీగా వివరాల సేకరించాక ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.