ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 06:54 PM

అమరావతి: ఎపి రావలసిన నిధులపై పార్లమెంట్ గళమెత్తాలని వైసిపి ఎంపిలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కోరారు.. ఈ నెల 18వ తేదిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో తాడేపల్లిలోని తన నివాసంలో ఆ పార్టీ ఎంపిలతో సమీక్ష నిర్వహించారు.  పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై   జగన్‌  ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎంపీలకు వివరించారు. కేంద్ర విద్యాలయాలకు నిధులు, బొగ్గు కొరత, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల గురించి వారికి సవివరంగా తెలిపారు..ఎపికి వీలైనంత ఎక్కువగా  నిధులు వచ్చేలా ఎంపీలు కృషి చేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com