8 ఏళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు విచారణకు పిలవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దతాడేపల్లిలో 8ఏళ్ల బాలిక వెంకటరమణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురానికి చెందిన ఉప్పలపాటి శ్రీను(30)ను పోలీసులు విచారణకు పిలిచారు. కాల్ డేటా ఆధారంగా బాలిక తల్లితో శ్రీనుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శ్రీనును విచారణకు పోలీసులు పిలిచారు. భయపడిపోయిన శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడు.