కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు ప్రకటించనున్నది. కర్ణాటకలో వీరి తిరుగుబాటుతో జనతాదళ్ సెక్యులర్ (జెడిఎస్), కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పడిపోయింది. అప్పటి స్పీకర్ వీరిపై అనర్హత వేటు వేస్తూ ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వకూ పోటీ చేయడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేశారు. దీనిని వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.