ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమచారాన్ని అన్ని శాఖలకు ప్రభుత్వం తెలియజేసింది. సంక్షేమ పథకాల అమలు తీరుతోపాటు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని శాఖ కార్యదర్శులకు ప్రభుత్వ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. నెలలో రెండు, నాల్గో బుధవారాల్లో మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.