మీ విండోస్ పీసీల్లో క్రోమ్ బ్రౌజర్ను వాడుతున్న వారికి ఇది ఖచ్చితంగా హెచ్చరికే. ప్రస్తుతం వాడుతున్న క్రోమ్ బ్రౌజర్ వెర్షన్లో పలు సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, దాంతో హ్యాకర్లు పీసీని కంట్రోల్ చేయడంతోపాటు ఆ పీసీలో ఉన్న సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉంటుందని గూగుల్ తన క్రోమ్ వినియోగదారులకు తెలిపింది. ఎవరైతే క్రోమ్ ని ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం వాడుతున్నారో వారు వెంటనే ఆ సాఫ్ట్వేర్ను నూతన వెర్షన్కు అప్డేట్ చేసుకోవాలని లేదంటే సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయని గూగుల్ హెచ్చరించింది. వెంటనే వినియోగదారులు తమ తమ పీసీల్లోని క్రోమ్ బ్రౌజర్ను నూతన వెర్షన్కు కచ్చితంగా అప్డేట్ చేసుకోవటం ద్వారా సమాచారానికి సురక్షితం కలిగించ వచ్చని గూగుల్ తెలిపింది.