ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పాలనలో పోలవరానికి ప్రత్యేక స్థానం… కారణం తెలుసా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 06:47 PM

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో మరో కలికితురాయి చేరింది. ఆంధ్ర ప్రదేశ్ కి ఎంతో ప్రతిష్టాత్మకంగా పేరు గాంచిన పోలవరాన్ని రానున్న రెండేళ్లలో పూర్తీ చేయనున్నాడు. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ విషయం లో టీడీపీ, వైసీపీ లకు పెద్ద మాటల యుద్ధమే జరిగింది. గతంలో వున్న నవయుగ సంస్థని రద్దు చేసి, మేఘ సంస్థకి పోలవరాన్ని కట్టబెట్టారు జగన్ మోహన్ రెడ్డి. నవయుగ సంస్థ హైకోర్టు లో వేసిన పిటిషన్ కొట్టివేయడం తో మేఘ కి లైన్ క్లియర్ అయింది. దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల్ని రివర్స్ టెండరింగ్ ద్వారా ఆడ చేశామని వైసీపీ నేతలు తెలిపారు.
పోలవరానికి అన్ని క్లియర్ అవ్వడం తో ప్రభుత్వాధికారులు-కాంట్రాక్టర్లు భూమి పూజని నిర్వహించి పనులు ప్రారంభం చేయనున్నారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ పోలవరాన్ని 70 శాతం పూర్తీ చేసిందనేది అబద్దం అని అన్నారు. తొందర్లోనే పోలవరాన్ని పూర్తీ చేస్తామని, అసలు మొదలు కాదు అనుకున్న ప్రాజెక్ట్ ఇపుడు ప్రారంభం అవ్వడం తో టీడీపీ నేతలు షాక్ కి గురయ్యారు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసారు. పోలవరం విషయం లో జగన్ చూపిస్తున్న చొరవకు వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com