ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ చిత్రపటానికి 108 సిబ్బంది పాలాభిషేకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 04:20 PM

కృష్ణా జిల్లా నందిగామ మార్కెటింగ్ యార్డ్ లో 108 సిబ్బంది కి పాదాయాత్రాలో ఇచ్చిన హామీ ను నిలబెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తు 108 సిబ్బంది ముఖ్యమంత్రి జగన్ చిత్ర పటానికి జై జగన్ అంటు హర్షధ్వానాల నడుమ పాలాభిషేకం చేశారు. 2004 లో అధికారం లో కి వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రతి ఒక్కరి కి మంచి మేలు జరగాలని ఉద్దేశంతో ఈ 108 వాహనాలను ఏర్పాటు చేశారని గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల ప్రాణాలను రక్షించడానికి, ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్సను అందించడానికి మధ్య వారధి గా పనిచేస్తున్న 108 సిబ్బంది కలలు నెరవేరాయని ఆనందం వ్యక్తం చేశారు. పాదయాత్ర సమయంలో 108 సిబ్బంది చాలి చాలని జీతాలతో, ఉద్యోగ భద్రత లేకుండా కుటుంబ గడవడం కష్టం తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జగన్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 108 సిబ్బంది కి భద్రత కల్పించడంతో పాటు జీతాలు పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారని ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకోని మాట మీద ఉండే వ్యక్తి అని నిరూపించుకున్నారని 108 సిబ్బంది తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com