ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 ఏపీ అవతరణ దినోత్సవం కావున రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే…
"నూతన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సారిగా రాష్ట్రఅవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నాం. 2014 నుంచి 2019 వరకు అవతరణ ఉత్సవాలు జరగలేదు. ఐదేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం వీటిని జరపకుండా నిర్లక్ష్యం చేసింది. 1956 నవంబర్ 1 న రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి అదే రోజు ఈ అవతరణోత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు నిర్ణయించారు. తెలుగువారు కలలుగన్న భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్ష నేరవేరిన రోజు ఇది.
1953లో ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలతో కర్నూలు హెడ్ క్వార్టర్స్ గా ఉంది.ఆ తర్యాత కూడా ఉద్యమాలు జరగుతున్నాయి.ఎందుకంటే కేవలం 11 జిల్లాలలోతోనే కాదు తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒక గొడుగు కిందకు రావాలని విశాలాంధ్ర ఏర్పడాలనే బలమైన కోరిక ఉంది.ఈ ఉద్యమాలు చూసి ఆనాటి కేంద్రప్రభుత్వం ధార్ కమిటీని వేసింది. ఆ కమిటీ కూడా తెలుగు మాట్లాడేవారి ఆకాంక్షను గుర్తించింది. కానీ నిర్ణయం తీసుకోలేకపోయారు. 1952లో ధార్ కమిటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ కమిటీ నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చారు. ఎట్టిపరిస్దితులలో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడాలని అనుకున్నారు. దానిపరిణామం నేపధ్యంలోనే పాక్షికంగా 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
దాని తర్వాత అనూహ్యంగా ఆంధ్రుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఉద్యమాలు ఊపందుకున్నాయి. వాటికి ఊపిరిపోశాడు స్వర్గీయ పొట్టిశ్రీరాములు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నవాళ్లు,గతంలో పోరాటాలు చేసినవారు పొట్టిశ్రీరాములు పోరాటానికి మద్దతు పలికారు. ఒకటి కాదు రెండు కాదు 58 రోజులు ఆమరణ దీక్షద్వారా పోరాటం కొనసాగించారు.ఆ తర్వాత అశువులు బాశారు.ఇక జాప్యం చేస్తే బాగోలేదు అని జవహర్ లాల్ నెహ్రూగారు అనౌన్స్ చేశారు. కాని దాంతో తృప్తిపడక స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ వేసి,ఆ కమిటీతో పరిశీలించమన్న తర్వాత జస్టిస్ సజలాని కమిటి వేశారు. ఆ కమిటి స్పష్టంగా చెప్పింది. ఇంకా అనేక డిమాండ్స్ ఉన్నాయన్నారు. ఇన్ని పరిస్థితులను దాటి విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ రోజు సీఎం జగన్ మూడు రోజుల పాటు ఆంధ్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించాలని భావించడం నిజంగా అభినందించదగ్గ అంశం. అని ఆయన అన్నారు."
ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.