ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదకర స్థాయికి కాలుష్యం...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 03:18 PM

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. గత కొంతకాలంగా ఢిల్లీ కాలుష్య స్థాయి నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల వ్యర్థాలు భారీగా తగలబడుతుండడంతో ఢిల్లీ నగరాన్ని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. పీల్చే గాలిలో నష్టదాయక వాయువుల మోతాదు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలు మూసివేశారు. ఇప్పుడు నవంబరు 5 వరకు పాఠశాలలు మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. అన్ని పాఠశాలలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. అటు, ఢిల్లీలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com