ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం దంతెవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం లో విశాఖకు చెందిన వైద్యురాలి కుటుంబంలోని నలుగురు దుర్మరణం చేందారు. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెండగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు..మృతులంతా విజయనగరం వాసులుగా గుర్తించారు. విజయనగరంలోని మహరాజా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – మిమ్స్ లో అనాటమీ ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ సునీత కుటుంబీకులు ఏడుగురు రెండు రోజుల క్రితం ఛత్తీస్ఘడ్ రాష్ట్రం జగదల్పూర్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్, పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ చూశాక అక్కడి నుంచి రైలుమార్గంలో దంతెవాడకు వచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ క్యాబ్ను మాట్లాడుకుని దంతెవాడ దంతేశ్వరీ ఆలయం, సమీపంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లారు.
ఈ క్రమంలో జగదల్పూర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును వారు వెళ్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ సునీత, ఆమె కుమార్తె శ్రేయ స్పాట్ లో చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. వారిలో సునీత భర్త లక్ష్మణరావు, సోదరుడు వి.రమేష్ ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విజయనగరంలోని సీతంపేటకు చెందిన వి.త్రిమూర్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.