పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం – నెలటూరు గ్రామానికి చెందిన పిట్టా అలివేలు మంగ 2014 నుంచి చిట్టీల పేరుతో మోసలకు పాల్పడింది.ఈ నేపథ్యంలో నే చాగల్లు, నెలటూరు గ్రామాలకు చెందిన 7 గురు నుంచి చిట్టీల వ్యాపారం నిమిత్తం రూ.3.50 లక్షలు వసూలు చేసి మోసగించింది. దీనిలో భాగంగానే అప్పటి ఎస్సై ఎన్.రవికుమార్ కేసు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించి ఏపిపి హనుమంతురావు తన వాదనలు కొనసాగించగా నిడదవోలు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ వై శ్రీలక్ష్మి నిందితురాలికి ఏడాది పాటు సాధారణ జైలుశిక్ష తో పాటు రూ.2వేల రూపాయల జరిమానా విధించారు.