కార్తీకమాసం మంగళవారం నుండి ప్రారంభం కావటంతో మాచవరం లో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి సమేత రాజేశ్వర స్వామి ఆలయంలో తొలి లక్ష బిల్వార్చన ప్రారంభమైయింది.మాచవరానికి చెందిన పద్మాజీ కనస్ట్రక్షన్స్ అధినేత మైపాల తాతాజీ,పద్మావతి దంపతులు లక్ష బిల్వార్చన కు సంకల్పం నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు సుసర్ల బుజ్జి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చనను ఆలయ అర్చకులు మాచరి వెంకటరాజు పర్యవేక్షణలో అమ్మవారికి కుంకుమ పూజ ను కూడా నిర్వహించారు.