గుంటూరు జిల్లాలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. జిల్లాలోని దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో పోలవరపు తులసి పార్వతమ్మ దినకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దిన కర్మ కార్యక్రమంలో తులసి పార్వతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిచారు. కార్యక్రమంలో మంగళగిరి తేదేపా మాజీ ఇన్ చార్జ్ గంజి చిరంజీవి, వెంకట్రావు, కోటేశ్వరరావు, పోలవరపు హరిబాబు తదితరులు పాల్గొని నివాళులు అర్పిచారు.