రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఓ రహదారిపై మావోయిస్టులు ఐఈడీ బాంబులు నాటారు. ఇవాళ ఆ రహదారి గుండా వాహనం వెళ్తున్న సమయంలో ఆ ఐఈడీ బాంబును పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలతో కలిసి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.