న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్ క్రిష్ణమురారీ, జస్టిస్ శ్రీపతి రవీంద్ర భట్, జస్టిస్ వీ రామసుబ్రమణ్యన్, జస్టిస్ హృషికేశ్రాయ్లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరుకుంది. కొత్త న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టులో మరో రెండు కోర్టు హాళ్లు ఏర్పాటు చేశారు. 16, 17 కోర్టు హాళ్లను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ రోజు నుంచి 16 ధర్మాసనాల్లో కేసుల విచారణ జరుగుతుంది.