పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల తెలుగు ఉపాధ్యాడు ఖండాపు మన్మథరావుని డిసెంబర్ 27, 28, 29 తేదీలలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహణ కార్యవర్గ సభ్యులుగా అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, కార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణచంద్ లు నియమించారని ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మన్మథరావుకి తెలుగు సాహిత్యాభిమానులతో, తెలుగు సాహిత్యవేత్తలతో, తెలుగు భాషాభిమానులతో సుధీర్గకాలం నుండి విస్తార పరిచయాలున్నందున వారికి సభల అవసరం, వాటి ప్రాధాన్యత, వాటి గొప్పతనంతో పాటు సభ్యత్వం నమోదు చేసుకొని ఈ సభలో పాల్గొని వివరించగలడని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహా సభలనిర్వాహణ కార్యవర్గ సభ్యునిగా మన్మథరావుని నియమించినందుకుగాను, సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు నళ్లురి వెంకటేశ్వర్లు, సెక్రటరీ పాలడుగు లక్ష్మణరావు, కళాశాల డైరెక్టర్ వి.బాబూరావు, డీన్ ఆచార్య జంపాల రాజేష్ తదితర అధ్యాపకులు అభినందించారు.