ఇప్పటికే పెట్రో వడ్డనలతో జనం లబోదిబో అంటుంటే నిన్న అర్దరాత్రి నుంచి డీజిల్ లీటరు ధర రెండున్నర రూపాయలు, లీటరు పెట్రోలుపై ఒక రూపాయి పెరిగింది. ఐతే ఇది మన రాష్ట్రంలో కాదు లెండి. ఉత్తరప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చి అమాంతం పెరిగా యి. ఇప్పటిగే రోజువారీ సవరణ మాటున పేట్రోలియం సంస్థలు ఇష్టానుసారం జనంతో ఆడుకుంటున్నాయి. తగ్గింపు పైసల్లో ఉంటే..పెంపు మాత్రం రూపాయల్లో ఉంటుందని వాహనదారులు ఆరోపిస్తున్నా, పట్టించుకున్న నాధుడే లేదు, తాజాగా జనసంక్షేమమే మా లక్ష్యం అని చెప్పే యోగీ సర్కారు పెట్రోలుపై వ్యాట్ ను 26.80%, డీజిలుపై 17.48% పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ధరలు పెరిగాయి. అయితే పెట్రో ధరల పెంపుతో యూపీ ప్రజలు భగ్గుమంటున్నారు,