ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ను భారత ఆక్రమిత కాశ్మీర్ గా అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దు తో భారత ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజల జీవనం ఛిద్రమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కర్ఫ్యూ ఎత్తివేశాకా కాశ్మీరీల పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ ఏం జరుగుతుందన్న ఆందోళన యావత్ ప్రపంచంలోనూ నెలకొని ఉందన్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేస్తే కాశ్మీరీల స్వాతంత్ర్య పోరాటం ఆగిపోతుందని భారత్ భావిస్తోందనీ, అయితే అందుకు భిన్నంగా కాశ్మీరీల పోరాటం మరింద ఉధృతమౌతుందని ఇమ్రాన్ పేర్కొన్నారు.