ఆదివాసీలు, గిరిజనులకు అండగా ఉంటామని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో గిరిజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇప్పుడు రద్దుల ప్రభుత్వం వచ్చిందన్నారు. నిన్న కియా కారు వస్తే… వైఎస్ వల్ల వచ్చిందని చెబుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుక రేట్లను 5రెట్లు పెంచారన్నారు. ఇసుక పంపిణీలో వైసీపీ నేతలు దోచుకుంటున్నారన్నారు. తాను ఇక్కడే ఉంటున్నానని గుంటూరు టీడీపీ ఆఫీస్ నూ కూల్చుతారేమోనని చంద్రబాబు అన్నారు.