ఆర్టికల్ 370, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్ విప్గా వ్యవహరిస్తున్న భువనేశ్వర్ కలిత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన అందించిన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. కీలకమైన బిల్లుల ఓటింగ్ విషయంలో పార్టీ చీఫ్ విప్ రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురెబ్బేనని చెప్పాలి.ఆర్టికల్ 370 రద్దు విషయంలో దేశ ప్రజల వైఖరికి విరుద్ధం గా పార్టీ వ్యవహరించిన తీరు మనస్తాపం కలిగించిందని, పార్టీ చేస్తున్న విధ్వంసకర రాజకీయాలలో భాగస్వామిని కాలేకానీ రాజీనామా ుచేయాలనీ నిర్ణయించు కున్నట్టు కలిత పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తానని తెలిపారు. కాగా అయన త్వరలో బీజేపీ లో చేరాలని భావిస్తున్నట్టు వార్తల నేపధ్యం లోనే కాంగ్రెస్ కి రాజీనామా చేసినట్టు ఆ పార్టీ వర్గాల మాట.