చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణం జరిగింది. నగర శివారులోని శెట్టిపల్లి రైల్వే గేట్ దగ్గర యువకున్ని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మెడ దగ్గర, చాతిపై కత్తులతో లేదా బీరు బాటిళ్లతో తీవ్రంగా గాయపరిచి చంపేశారు. ప్రేమ వ్యవహారంలో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ద్వారకానాథ్ గా గుర్తించారు. తిరుపతిలోని కృష్ణతేజ డిగ్రీ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ (బీబీఏ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. శెట్టిపల్లిలో ఓ రూమ్ ను అద్దెకు తీసుకొని చుదువుకుంటున్నాడు. వీరి తల్లిండ్రులు కువైట్ లో ఉద్యోగం చేస్తూ అతన్ని చదివిస్తున్నారు.
స్థానికుల సమచారం మేరకు పోలీసులు తిరుపతి నగర శివారులోని శెట్టిపల్లి రైల్వే గేట్ సమీపంలో మృత దేహాన్ని గుర్తించారు. రాత్రి మృతదేహాన్ని ఎస్ వీ వైద్యకాలేజీ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటి క్రితం పోస్టుమార్టం పూర్తి అయింది. రైల్వే గేట్ సమీపంలో కొంతమంది వ్యక్తులు తరుముతున్నట్లు, అతను భయంతో పరుగులు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ హత్య వెనుకాల ప్రేమ వ్యవహారం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరు అతన్ని చంపారు? హత్య గల కారణాలేంటి? అన్న కోణలో విచారిస్తున్నారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఒక పోలీస్ బృందం కృష్ణ తేజ ప్రైవేట్ కాలేజీకి వెళ్లింది. కాలేజీలో గొడవలు, ప్రేమ వ్యవహారం, ద్వారకానాథ్ పరిస్థితితోపాటు అన్ని విషయాలపై ఆరా తీస్తున్నారు.