పశ్చిమ బెంగాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు ఏనుగు దంతాలు, పులి దంతాలు, గోళ్లు స్మగుల్ చేసే ముఠాను పట్టుకున్నారు. వారినుంచి 12 కిలోల ఏనుగు దంతాలను, ఐదు పులి దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1.147 కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా వేశారు. హబీబుల్లా అనే వ్యక్తి ఒక సిండికేట్ను ఏర్పాటు చేసుకుని కోల్కతా స్థావరంగా స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.