బెంగళూరు: దేశవ్యాప్తంగా ఉన్న కేఫ్ కాఫీ డే ఔట్లెట్లు నేడు మూతపడ్డాయి. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మృతికి సంతాపంగా యాజమాన్యం సెలవు ప్రకటించింది. రెండ్రోజుల క్రితం మంగళూరులోని నేత్రావతి నది వద్ద అదృశ్యమైన సిద్ధార్థ మృతదేహాన్ని నేత్రావతి నది బ్యాక్ వాటర్లో నేడు గుర్తించారు. మృతదేహాన్ని వెన్లాక్ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం సిద్ధార్థ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.