విద్యార్థులు చదువుతోపాటు విధేయతతో తల్లిదండ్రులను, గురువులను ,పెద్దలను గౌరవించడం నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అని తెలిపారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. శనివారం ఆమె రాజన్న బడి బాటలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఆడపిల్లలను చులకనగా చూడకుండా మగ పిల్లవాడి తో పాటు చదువుల విషయంలో ప్రోత్సహించాలని అమ్మబడి పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసేందుకు ప్రణాళిక సిద్దమైందని తెలిపారు. తల్లిదండ్రులకు పిల్లల చదువు విషయంలో భారం కాకూడదని పిల్లలు ఎవరు బాల కార్మికులుగా ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ అడబ్బులు సక్రమ మార్గంలో తమ యొక్క అవసరాలకు ఉపయోగించుకుని విద్యర్ధులు మంచి భవిష్యత్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ జొన్నలగడ్డ రాధా రాణి, మున్సిపల్ కమిషనర్, మండల విద్యాధికారి, ఉపాధ్యాయులు అధికారులు పాల్గొన్నారు.