శ్రీవారికి నిర్వహించే అభిషేకం ఇతర సేవల కారణాల వలన సంవత్సరం పొడవునా ప్రతి శుక్రవారం రోజున విఐపి బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేయాలని టిటిడి నిర్ణయించింది. ఇక నుంచి శుక్రవారం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫార్సు లేఖలు స్వీకరించరాదని నిర్ణయించింది అలాగే జూలై 15వ తేది వరకు శని, ఆదివారాలలో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ పరిధిలోని విఐపిలకు మాత్రమే పరిమితం చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మరింత కఠినంగా అమలు చేయనుంది. దీంతో ఆయా తేదీలలో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని, విఐపిలు మరియు భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరింది.