ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే అమరావతికి వచ్చా: రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2019, 04:50 PM

నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్ నుండి పిలుపు వచ్చిందని, టీటీడీ, ఆర్టీసీ చైర్మన్ పదవులలో ఏదోకటి తననే సెలెక్ట్ చేసుకోవాలని జగన్ ఆఫర్ ఇచ్చారని కథనాలు వస్తుండగా రోజా మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. అవన్నీ పుకార్లేనని.. తనను ఎవరూ అమరావతికి రావాలని పిలవలేదని కొట్టిపడేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే అమరావతికి వచ్చానని, పదవుల ఊసే తనకు ఎవరూ చెప్పలేదన్నారు. కులాల లెక్కల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని.. తాను కులాలను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికి శుభాకాంక్షలు తెలిపిన రోజా తాను అలిగానని వస్తున్న వార్తలను కూడా కొట్టిపారేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com