తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో డీజీపీ గౌతం సవాంగ్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా హోటల్ గేట్ వే కు చేరుకున్నారు. సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలవనున్నారు. కొత్త కేబినెట్ లోని 25 మంది వివరాలను ఆయనకు అందచేస్తారు. గవర్నర్ ఆమోదం లభించాక కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రులకు పార్టీ పెద్దలు ఫోన్ చేయనున్నారు. శనివారం సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం ప్రొటెం స్పీకర్ శంబంగి చినఅప్పనాయుడుతో కూడా ప్రమాణం చేయిస్తారు.