ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ తో భేటీ అయిన ఆపార్టీ ఎకైక ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 04:37 PM

రాజోలు ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నుంచి విజయం సాధించిన ఏకైక అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం విజయవాడ పడమటలంకలోని పవన్ కల్యాణ్ స్వగృహంలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి కూడా విజయం దక్కించుకోకపోగా రాపాక ఒక్కరే గెలిచి ఆ పార్టీకి ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కేలా చేశారు.


మల్కిపురం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాపాక 2009లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 30 ఏళ్లుగా క్షత్రియ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న రాజోలు నియోజకవర్గం రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 15 వేల ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరిగా జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com