రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నరసింహన్ విజయవాడకు చేరుకున్నారు. రేపు ఉదయం 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్న నేపథ్యంలో గవర్నర్ ఈ మధ్యాహ్నమే విజయవాడకు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రుల ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతుండగా మరోపక్క అధికార వర్గాలలో మంత్రివర్గం ఖరారైన శిబిరాలలో పండగవాతావరణం నెలకొంది.