ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెదిరించి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 12:54 PM

నోరు నొక్కి కత్తితో బెదిరించి దొంగతనం చేసిన ఘటనపై రాజమహేంద్రవరం పరిధిలోని బొమ్మూరు పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీ వీధిలో కామిని వెంకటలక్ష్మీ తన కుమారుడు, కోడలుతో నివాసం ఉంటున్నారు. ఈనెల 21న ఆమె కుమార్తె రామ సత్యవతి ఇంటికి పెద వాడపల్లి వెళ్లారు. అదేరోజు రాత్రి 2గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కిటికీ గ్రిల్స్‌ తొలగించి దాని ద్వారా మెయిన్‌ డోర్‌ గొళ్లాన్ని తొలగించి ఇంట్లోకి ప్రవేశించాడు. వెంకటలక్ష్మీ వద్దకు వచ్చి నోరును బలవంతంగా నొక్కివేసి అతడి వద్ద ఉన్న చాకు తీసి పీక కోసి చంపేస్తానని బెదిరించాడు. ఆమె చేతికి ఉన్న రెండు బంగారు గాజులు, ఉంగరం లాక్కున్నాడు. బీరువా తాళం ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో ఆమె తాళం ఇచ్చారు. ఆమె ఎదురుగా ఉన్న బీరువాలో ఉన్న 6 బంగారు గాజులు, రెండు పేటల బంగారు గొలుసు తీసుకున్నాడు. కుమారుడి బెడ్‌రూం తాళం విరగ్గొట్టి ఆ గదిలోకి ప్రవేశించి కీబోర్డు తాళం కూడా తొలగించి ఒక బంగారు హారం, ఒక నల్లపూసల తాడు, ఒక నక్లెస్‌, 3 జతల చెవి రింగులు, ఒక జత గాజులు, బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌, ముద్ద బంగారం, నల్లపూసల తాడు, పెండెంట్‌.. మొత్తం కలిపి 40కాసుల బంగారు వస్తువులు దొంగిలించాడని వెంకటలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఉమర్‌ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com