ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈదురుగాలుల బీభత్సం: వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2019, 05:58 PM

జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసె గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని కోళ్లఫారం షెడ్డు కూలడంతో గొర్ల శ్రీను అనే వ్యక్తి మృతి చెందారు. దేవరకొండలో, చందంపేట, కొండమల్లెపల్లిలో గాలిదుమారం రేగింది. చండూరు, నల్లగొండ, నకిరేకల్, కట్టంగూర్‌లో వర్షం పడుతోంది. మునుగోడు మండల కేంద్రంలో రాళ్లవర్షం పడింది. చీకటిమామిడి గ్రామంలోని రాజీవ్‌నగర్ గ్రామంలో ఈదురుగాలులకు రేకుల ఇండ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. కొరిటికల్ గ్రామంలో పిడుగుపడి మేకలతో సహా కొట్టం కాలి బూడిదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com