ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో పోటీ చేసినఅభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 10:05 PM

టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు ఈ నెల 22న అమరావతిలోని పార్టీ  కార్యాలయంలో హాజరుకావాలని  చంద్రబాబు అదేశాలు జారీ చేశారు. ఈ రోజు అభ్యర్ధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద్భంగా పోలింగ్ తీరుపై అనేక మంది సభ్యులు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ఏం చెబితే ఈసీ ఆ పనిచేసిందని కొందరు అభ్యర్ధులు చంద్రబాబు దృష్టికి  తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న లోపు నివేదిక తయారు చేసి... అమరావతిలో జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలంటూ ప్రత్యేకంగా కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ పోరాటం వ్యక్తులపై కాదని..ఎన్నికల్లో జరిగిన అవకతవకలపైననని స్పష్టం చేశారు.ఎన్నికల నిర్వహణ తీరును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్ధుల నుంచి సమచారం తీసుకొని ఈ మేరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com