తూర్పు తైవాన్ను భూకంపం వణికించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. భూకంపం వల్ల రాజధాని తైపేలోని భవనాలు కంపించాయి. భూకంప కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలోనే రాజధాని ఉంది. ప్రధానంగా తీర ప్రాంతమైన హువాలీన్పై భూకంపం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడి నుంచీ 10 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉంది. నష్టానికి సంబంధించి అప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు అధికారులు. తరచుగా భూకంపాలు వచ్చే సిస్మిక్ జోన్లో తైవాన్ కూడా ఉంది. ఈ సిస్మిక్ జోన్ను పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తున్నారు. భూమి చుట్టూ ఉండే ఈ రింగు భాగంలో భారీ అగ్నిపర్వతాలున్నాయి. వాటి కారణంగా తరచూ అక్కడి భూ పలకాలు కదులుతున్నాయి. అవి కదిలినప్పుడల్లా భూకంపాలు వస్తున్నాయి.
తైవాన్ విషయానికొస్తే... ఫిలిప్పీన్ సీ ప్లేట్, తూర్పున ఉండే యురేషియా ప్లేట్ తరచూ కదులుతున్నాయి. ఆ పలకాలు కదిలినప్పుడల్లా తైవాన్ భూ ప్రకంపనలతో వణుకుతోంది. 2016లో దక్షిణ తైవాన్లో వచ్చిన భూకంపానికి 100 మందికి పైగా చనిపోయారు. 1999లో 7.6 తీవ్రతతో భూకంపం రాగా... అప్పట్లో 2000 మందికి పైగా చనిపోయారు. అందువల్ల తరచూ వచ్చే భూకంపాలతో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు.